ఏపీ రోజువారీ కరోనా కేసుల తాజా బులెటిన్ ఇదిగో!

  • ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 65,596 కరోనా పరీక్షలు
  • 1,623 మందికి పాజిటివ్
  • తూర్పు గోదావరి జిల్లాలో 342 కేసులు
  • రాష్ట్రంలో 8 మంది మృతి
ఏపీలో గడచిన 24 గంటల్లో 65,596 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,623 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 342 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 276, నెల్లూరు జిల్లాలో 194 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 16 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,340 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,21,325 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,92,256 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,158 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 13,911కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Bulletin
Daily Cases

More Telugu News